పది ఫలితాల్లో ‘ శ్రీ సాయి రామ’ విజయఢంకా

  • అభినందనలు తెలిపి ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధి ప్రేమ్ నగర్ శ్రీ సాయి రామ హై స్కూల్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అభినందించి, ఆశీర్వదించి, ఆంగ్ల నిఘంటువులను అందజేశారు.

శ్రీ సాయి రామ హై స్కూల్  విద్యార్థినికి అభినందనలు తెలిపి ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నామని, 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అభిలాషించారు.

శ్రీ సాయి రామ హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులతో ఎమ్మెల్యే గాంధీ

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కరస్పాండెంట్ సత్యం గుప్తా, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here