శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని పలువురు నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హఫీజ్పేట్ డివిజన్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కొండాపూర్ డివిజన్ మార్తాండ్ నగర్ కాలనీ వాసులు, హఫీజ్పేట్ డివిజన్ ప్రజయ్ సిటీ వాసులు, హైదర్ నగర్ డివిజన్ గౌతమి నగర్ కాలనీ వాసులు, చందానగర్ డివిజన్ తెరాస నాయకుడు మిర్యాల ప్రీతం, మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండా వాసులు, హైదర్ నగర్ డివిజన్ అడ్డగుట్ట సొసైటీ కాలనీ అసోసియేషన్ సభ్యులు గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.







ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కి నడిగడ్డ తండా కాలనీ వాసులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎంపీ రంజిత్ రెడ్డికి చందానగర్ డివిజన్ తెరాస నాయకుడు మిరియాల ప్రీతమ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు త్రినాథ్, నాగరాజు, తిరుమలరావు పాల్గొన్నారు.






