శేరిలింగంపల్లి, జూలై 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని హైటెక్ సిటీ డివిజన్ పరిధిలో ఉన్న కావూరి హిల్స్ ఫేజ్ 2 లో సోమవారం ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకురాలు మమత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ BLO తో పాటు తిరిగి ఎస్ఐఆర్ (SIR) ఫామ్లను పంపిణీ చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేరు ఓటరు జాబితాలో ఉండేలా జాగ్రత్త వహించాలని సూచించారు.






