శేరిలింగంపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్కు 2 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్ వింగ్ కు 4, యూబీడీకి 1 మొత్తం కలిపి 7 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.






