శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో హఫీజ్ పేట్ యువ నాయకుడు ధాత్రీనాథ్ గౌడ్ పాల్గొన్నారు. వినాయకనగర్ కాలనీ, ప్రకాష్ నగర్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో, మదీనాగూడ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణమహోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.






