శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని శ్రీరామకృష్ణ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 11, 12 తేదీల్లో సంగీతం, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నారు. కూకట్పల్లి, మియాపూర్ పరిసరప్రాంతాల \లోని ఔత్సాహికులు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. శ్రీరామకృష్ణవివేకానంద సేవాసమితి ధ్యానమందిరం, ప్లాట్ 166, రాధామాధవ్ అపార్ట్ మెంట్ జంక్షన్ దగ్గర, ప్రగతి ఎన్క్లేవ్ కాలనీ చిరునామాలో లేదా 9059892038 అనే ఫోన్ నంబర్లోనూ ఔత్సాహికులు సంప్రదించవచ్చని సూచించారు.





