శేరిలింగంపల్లి, డిసెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ నగర్ కు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్, రమేష్, నరేష్, రాజు, తనయ, శైలు, ఎం ఆంజనేయులు, భీమ్ రాజు, ఆంజనేయులు, శ్రీను, గణేష్, మహేష్, శిరీష్, మురళి, నరసింహ, ఎల్లయ్య, వెంకటేష్, రాజు, హనుమంతు గచ్చిబౌలి డివిజన్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమక్షంలో కార్పొరేటర్ కార్యాలయంలో బీజేపీలో చేరారు. వారికి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి అనేక మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అతి తక్కువ కాలంలోనే చేసి చూపించిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీని ఎదుర్కునే సత్తా ఏ పార్టీకి లేదని అన్నారు. బీజేపీని నమ్మి చేరిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం తప్పక లబిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ ఉపాధ్యక్షుడు తిరుపతి, కేశవ నగర్ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నాయకులు రాజు, శ్రీను, యాదయ్య , స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






