శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో వ్యాకరణ ప్రౌడనోరమాయ కృతవ్యాఖ్యాయ సమీక్షాత్మక మధ్యాయనమ్ ప్రౌడమామెరన్ పై జగన్మాతాయ వ్యాఖ్యాన విభాగంలో రామానుజం శ్రీధర్ స్వామి డాక్టరేట్ సాధించారు. న్యూబోయిన్ పల్లి సికింద్రాబాద్ కి చెందిన రామానుజం శ్రీధరస్వామి పిహెచ్.డి. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర వేదాంత వర్థిని సంస్కృత కళాశాలలో డిగ్రీ వరకు చదువుకొని అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ సంస్కృతం, తెలుగు పట్టు సాధించడమే కాకుండా పి.హెచ్.డి సాధించారు. రామానుజం శ్రీధర స్వామి డాక్టరేట్ సాధిచడంపై సంస్కృత కళాశాల ప్రధానాచార్యుడు డా. బానోత్ సురేందర్ నాయక్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.






