మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని మాదాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. డిసెంబర్ 1వ తేదీన జరగనున్న గ్రేటర్ ఎన్నికలలో ప్రజలందరూ కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లలో కళ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, బస్తీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.