కొమిరిశెట్టి సాయిబాబాను మ‌రొక‌సారి కార్పొరేట‌ర్‌గా గెలిపించాలి: ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి

గ‌చ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ లో కేవ‌లం తెరాస హ‌యాంలోనే అభివృద్ధి జ‌రిగింద‌ని ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి అన్నారు. డివిజ‌న్ ప‌రిధిలోని న‌ల్ల‌గండ్ల‌లో తెరాస కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి కొమిరిశెట్టి సాయిబాబాతో క‌లిసి ఆయ‌న ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేవ‌లం తెరాస ప్ర‌భుత్వం మాత్ర‌మే ప్ర‌జ‌ల సంక్షేమానికి, డివిజ‌న్ల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. అన్ని వ‌ర్గాల సంక్షేమ‌మే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప‌నిచేస్తున్నార‌న్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వర్గాన్ని గ‌తంలో ఎన్న‌డూ లేనంత అభివృద్ధి చేశామ‌న్నారు. తెరాస కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి సాయిబాబాను మ‌రొక సారి గెలిపించాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పై ఉంద‌న్నారు.

కారు గుర్తుకు ఓటు వేయాల‌ని వృద్ధురాలిని కోరుతున్న ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, కొమిరిశెట్టి సాయిబాబా
ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, కొమిరిశెట్టి సాయిబాబా
ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, కొమిరిశెట్టి సాయిబాబా

ఈ కార్య‌క్ర‌మంలో నాయకులు గణేష్ ముదిరాజ్, నరేష్, చెన్నం రాజు, వసంత్ కుమార్, ఆకుల యాదగిరి, భిక్షపతి, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సత్యనారాయణ, రమేష్ గౌడ్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here