శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ మహిళల పాటలతో కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని పాపారాయుడు నగర్ మారుమోగింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్ల వద్దకు చేర్చి ఆడిపాడగా పాపారాయుడు నగర్ లో జాతర సాగింది. పాటకు తగ్గట్ల చప్పట్లు చరుస్తూ ఆటలాడారు.






