శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ జయ దుర్గ మైసమ్మ దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుకల్లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొప్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భక్తులకు, ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈఓ సతీష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






