శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): దేవుడిని రోజూ పూలతో పూజిస్తామని, దేవుడిని పూజించే పూలనే పూజించే గొప్ప పవిత్రమైన పండుగ బతుకమ్మ అని వడ్డేపల్లి యామిని అన్నారు. కూకట్ పల్లిలో శనివారం జరిగిన బతుకుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి యామిని మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ కలసి మెలసి జరుపుకునే పవిత్రమైన పండుగ బతుకమ్మ అని అన్నారు.






