స్టాలిన్ న‌గ‌ర్‌లో బీజేపీ నాయ‌కుల ముమ్మ‌ర ప్ర‌చారం

మియాపూర్ ‌‌‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని స్టాలిన్ న‌గ‌ర్‌లో డివిజ‌న్ బీజేపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి క‌ర్ల‌పూడి రాఘ‌వేంద్ర రావు ఆదివారం పాద‌యాత్ర నిర్వ‌హించారు. ఇంటింటికీ తిరిగి క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎంపీ వివేక్‌, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు మొవ్వా స‌త్య‌నారాయ‌ణ‌, కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌ల ఆధ్వ‌ర్యంలో స్థానికంగా ఉన్న ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు బీజేపీలో చేరారు. వారికి వివేక్‌, మొవ్వాలు బీజేపీ కండువాల‌ను క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం ప్ర‌శాంత్‌న‌గ‌ర్‌లోని ఆల‌యం వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ మాణిక్, డీఎస్ఆర్‌కే ప్రసాద్, మనోహర్, ప్రశాంతి, ఉదయ్, చందు, రవీందర్, విజయేందర్, రత్న కుమార్, రాజు, సిద్దు పాల్గొన్నారు.

బీజేపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి క‌ర్ల‌పూడి రాఘ‌వేంద్ర రావుకు హార‌తి ఇస్తున్న మ‌హిళ‌లు
ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హిస్తున్న మాజీ ఎంపీ వివేక్‌, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు మొవ్వా స‌త్య‌నారాయ‌ణ‌, కోనేరు స‌త్య‌నారాయ‌ణ
పార్టీలో చేరిన వారితో మాజీ ఎంపీ వివేక్‌, మొవ్వా స‌త్య‌నారాయ‌ణ‌, కోనేరు స‌త్య‌నారాయ‌ణ, క‌ర్ల‌పూడి రాఘ‌వేంద్ర రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here