ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేజ్ – 2 కు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ డిసెంబర్ 1 న జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెరాస పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని గాంధీ పేర్కొన్నారు. తెరాస పార్టీలోకి చేరిన వారిలో యాదవ్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఇస్మాయిల్, జఫ్ఫార్ హుస్సేన్, మహమ్మద్ పాషా, చారీ, కృష్ణ మూర్తి, సుధాకర్ ఉన్నారు.