- సరితబుచ్చిరెడ్డికి బి ఫారం ఇవ్వకుంటే రాజీనామా చేస్తానంటున్న గజ్జల యోగానంద్
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ బీజేపీ లో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. చందానగర్ పార్టీ అభ్యర్థి గా కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డికి బి ఫారం ఖరారైనట్లు సమాచారం. అయితే అధిష్టానం నిర్ణయాన్ని నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ దిక్కరించినట్లు తెలుస్తోంది. బి ఫార్మ్ సరితా బుచ్చిరెడ్డి కి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని రాష్ట్ర నాయకులను ఎదిరించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరి నిమిషంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బి ఫారం ఎవరు దక్కించుకుంటారో అని నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.