టిఆర్ఎస్ అధిష్టానం రెబెల్ అభ్యర్థులను కలుపుకొని నడవాలి: మిద్దెల మల్లారెడ్డి

హఫీజ్ పెట్(నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించి రెబెల్స్ గా బరిలో ఉన్న పార్టీ నాయకులను అధిష్టానం బుజ్జగించి పార్టీతో కలుపుకుని నడవాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు మిద్దెల మల్ల రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెబెల్స్ గా నామినేషన్ వేసిన మాజీ కార్పొరేటర్లు, పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడి పని చేసిన పలువురు ఉద్యమకారులు, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన సీనియర్ నాయకులకు తగిన న్యాయం చేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలనీ కోరారు. హఫీజ్ పెట్ డివిజన్ నుండి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆలు రాణి ని సముదాయించి నామినేషన్ ఉపసంహరించుకునేలా తాను ప్రయత్నం చేసినప్పటికీ ఆమె అంగీకరించలేదని తెలిపారు. ప్రభుత్వ విప్ గాంధీ, ఎన్నికల ఇంఛార్జ్ లు, నియోజక వర్గ వ్యాప్తంగా రెబెల్స్ గా బరిలో నిలుస్తున్న ప్రతీ నాయకుడికి తగిన హామీలు ఇచ్చినామినేషన్లు ఉపసంహరించుకునేందుకు కృషి చేయాలనీ మల్లారెడ్డి కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here