పెండింగ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌య్యేలా చూడాలి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, మే 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి అయ్యేలా చూడాల‌ని కోరుతూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ భోర్ఖడేను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ రానున్న బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేసేలా చూడాల‌ని, నియోజకవర్గ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్‌ను కోరామ‌ని తెలిపారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని, నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అనంతరం మంజీర పైప్ లైన్ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేసేలా చూడాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here