ఇందిరాగాంధీని నాయ‌కులు ఆద‌ర్శంగా తీసుకోవాలి

  • ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్

గ‌చ్చిబౌలి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గోపన్‌పల్లిలోని శిశు మంగళ అనాథ ఆశ్రమం విద్యార్థులకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ గురువారం బిస్కెట్స్, పండ్ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. అలీనదేశాల అధ్యక్షురాలిగా ఇందిరాగాంధీ భారతదేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప జేశార‌న్నారు. భారతదేశానికి 4 సార్లు ప్రధానిమంత్రిగా పని చేసి రాజ భరణాలు రద్దు చేసి బ్యాంకులను జాతీయీకరణం చేశార‌ని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానీయురాలు అని కొనియాడారు. నేటి నాయకులు ఆమెను ఆదర్శంగా తీసుకొని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాల‌న్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, రామ్మోహనరావు, పాలం శ్రీను, ఆశ్రమ నిర్వాహకుడు నాయక్ పాల్గొన్నారు.

చిన్నారుల‌కు బిస్కెట్లు, పండ్ల‌ను పంపిణీ చేసిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here