పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మానవసేవే మాధవసేవ అన్న నినాదం స్ఫూర్తి మేరకు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య‌ కార్మికులకు హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాల‌ హరీష్ రావు నిత్యావసర వస్తువుల‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మదీనాగూడ రామకృష్ణ నగర్ సర్కిల్ లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వాలా హరీష్ రావు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల కిట్ల‌ను పంపిణీ చేశారు. అనంతరం వాల హరీష్ రావు మాట్లాడుతూ నిత్యం పరిసరాల పరిశుభ్రతతోపాటు మన ఆరోగ్య భద్రత విషయంలో పాటుపడుతున్న పారిశుద్ధ్య‌ కార్మికులను గౌరవించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

పారిశుద్ధ్య‌ కార్మికులకు నిత్యావ‌స‌రాల కిట్ల‌ను పంపిణీ చేసిన వాల హ‌రీష్ రావు

ఈ కార్యక్రమంలో సహదాతలు షేక్ మీరావలి, రసూల్, బాబు మోహన్ మల్లేష్, ఉమామహేశ్వరరావు, కృష్ణారావు, విష్ణు రెడ్డి, లక్ష్మణ్ నాయుడు, భాను ప్రకాష్, రాము, గణేష్, రెడ్డి, మల్లేష్ యాదవ్, రంగారావు, ఆనందరావు, వీరభద్ర రావు, కేశవరావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here