శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ శుక్రవారం డివిజన్ పరిధిలోని మంజీరా పైప్ లైన్ మరమ్మత్తు పనలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చొరవతో మంజీరా పైప్ లైన్ రోడ్డుకు మహర్దశ పడుతుందని అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి రూ.40 కోట్లను మంజూరు చేయించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు చేపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ అభివృద్ధి పనులు త్వరగా జరిగేలా చూసేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.