తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీపై నాయ‌కుల నిర‌స‌న దీక్ష‌, పూజ‌లు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి కొండాపూర్ డివిజన్ న్యూ హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ హనుమాన్ గుడిలో తిరుమల తిరుపతి లో మహా ప్రసాదమైన లడ్డూ కల్తీ జరిగినందుకు శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేస్తూ క్షమాపూర్వక పూజా కార్యక్రమం, సాంఘిక నిర‌సన కార్యక్రమాలు నిర్వ‌హించ‌బ‌డ్డాయి. ఈ సంద‌ర్భంగా క‌మిటీ స‌భ్యులు మాట్లాడుతూ తిరుపతిలో లడ్డు కల్తీ జరిగినందువలన తాము ఈ నిరసన కార్యక్రమం చేప‌ట్టామ‌న్నారు. హిందూ సమాజం మొత్తం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టి.రామ‌కృష్ణ‌, బి.రాజు, పంతులు శ్రీ‌నివాస చారి, ఎ.స‌త్తిబాబు, శ్రీ‌నివాస్‌, రూపా రెడ్డి, ఎ. ల‌క్ష్మి, టి.రాజేశ్వ‌రి గాయ‌త్రి, భాగ్య‌ల‌క్ష్మి, జి.ల‌క్ష్మ‌ణ్ రెడ్డి, గోపాల‌కృష్ణ‌, డి.రాజు, ఎ.ప‌వ‌న్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆల‌యంలో పూజ‌లు చేస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here