గ‌ణ‌నాథుడికి ఎమ్మెల్యే గాంధీ పూజ‌లు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌పై ఆ గణేషుడి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి క‌ష్టాలు రాకుండా సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని ఆకాంక్షించారు. గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీలు చాలా మంది మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని అన్నారు. ఇదే సంప్ర‌దాయాన్ని ఏటా కొన‌సాగించాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

గ‌ణేషుడి పూజ‌లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here