గోప‌న్‌ప‌ల్లి వీక‌ర్ సెక్ష‌న్‌లో గ‌ణ‌పతికి మూల అనిల్ గౌడ్ పూజ‌లు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గణపతి నవరాత్రి ఉత్సవాల లో భాగంగా వినాయక యూత్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గోపనపల్లి వీకర్ సెక్షన్ కాలనీ లో నెలకొల్పిన గణపతి వద్ద బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి మూల అనిల్ గౌడ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గోపన్ పల్లిలో ఈ గణనాథుడిని దర్శించుకుంటున్నానని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలిపారు. గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు అంజన్ కుమార్ గౌడ్, కమిటీ అధ్యక్షుడు జోగు జితేందర్, కృష్ణ,పెద్ద కృష్ణ, రాములు, దారుగు పల్లి రాజేష్, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వినాయ‌కుడికి పూజ‌లు చేసిన మూల అనిల్ గౌడ్‌, బీజేపీ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here