బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డికి కార్పొరేట‌ర్ టిక్కెట్ ఇవ్వాల‌ని విన‌తి

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని నల్లగండ్ల గ్రామస్థులు గురువారం క‌లిశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గ‌చ్చిబౌలి డివిజ‌న్ నుంచి తెరాస కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు స్థానిక నాయ‌కుడు బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డికి అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. ఈ మేర‌కు స‌త్య‌నారాయ‌ణ రెడ్డి మంత్రికి విన‌తిప‌త్రంతోపాటు త‌న బ‌యోడేటాను అంద‌జేశారు.

మంత్రి స‌బితా ఇంద్రారెడ్డికి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి

ఈ కార్యక్రమంలో నల్లగండ్ల నాయ‌కులు బి వెంకట్ రెడ్డి, బి రాజి రెడ్డి, బి గోవర్ధన్ రెడ్డి, బి రఘుపతి రెడ్డి, బి బాల్ రెడ్డి, బి నరేందర్ రెడ్డి, బి అమరేందర్ రెడ్డి, పి రాజి రెడ్డి, పి మోహన్ రెడ్డి, పి కృష్ణ రెడ్డి, పి కొండల్ రెడ్డి, బద్ధం కొండల్ రెడ్డి, బి రాజేష్ రెడ్డి, బి నవీన్ రెడ్డి, తెరాస పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here