నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని మాదాపూర్, హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని, డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోనే మాదాపూర్/హాఫీజ్ పెట్ డివిజన్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ వద్ద స్థానిక ప్రజలతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజి పైప్ లైన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ యాదవ్, నందు, నర్సింహ, శ్రీరాములు, శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.