చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్క్లేవ్లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠపరిపాలిత శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం దేవాలయ ప్రాంగణంలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారిని శ్రీలలితా దేవి అవతారంలో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని స్థానికులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.






