శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్ప గార్డెన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయకుడిని, మాట్రిక్స్ ఆర్చిడ్స్ ఫ్యామిలీ లింగంపల్లి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటుచేసిన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు.

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గణపతికి పూజలు చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పలు వినాయక స్వామి మండపాల వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదములను అందజేశారు. అనంతరం విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన వేడుకున్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దుర్గం వీరేశం గౌడ్, నరసింహ గౌడ్, రవి యాదవ్, ఆదిత్య కిరణ్, గోపాల్ యాదవ్, శిల్ప గార్డెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీ.వీ.ఎస్ రామారావు, జనరల్ సెక్రెటరీ రామ్ కిషోర్ యాదవ్, సురేంద్ర, రాజశేఖర్, అశ్విన్, డి. కుమార్, భక్తులు పాల్గొన్నారు.

భక్తులకు అన్నదానం చేస్తున్న రాగం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here