మోడీ పథకాలపై బిజెపి నాయకుల ఇంటింటికి ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి: దేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని బిజెపి‌ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జీ గజ్జల యోగానంద్ అన్నారు. ఎనిమిదేళ్ల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్ లో ఇంటింటికి తిరిగి మోడీ ప్రవేశపెట్టిన పథకాలను, వాటివల్ల ప్రజలకు కలిగే లాభాలను కరపత్రాల ద్వారా వివరించారు.

శేరిలింగంపల్లి డివిజన్ గోపీనగర్ లో ఇంటింటి ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు

అంత్యోదయ పథకంతో పేదలకు, అట్టడుగు వర్గాలకు సేవా కార్యక్రమాలను, పీఎం ఆవాస్ యోజన ద్వారా 1.22 కోట్ల ఇళ్ల మంజూరయ్యాయని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11.22 కోట్ల మరుగు దొడ్ల నిర్మాణం, పీఎం స్వనిధి యోజన ద్వారా 29.6 లక్షల వీధి వ్యాపారులకు రుణాల పంపిణితో పాటు పేద ప్రజల కోసం మరెన్నో పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను రాష్ట్రంలో అమలుచేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమవుతుందని ఇంటింటి ప్రచారంలో వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు గజ్జల యోగానంద్, మొవ్వా సత్యనారాయణ,‌ చింతకింది గోవర్థన్ గౌడ్, రాజు శెట్టి, రాఘవేందర్ రావు, కాంచన కృష్ణ, హరికృష్ణ, చంద్రమోహన్, సత్యకుర్మ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాల ద్వారా మోడీ పథకాలను వివరిస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here