రాజ్యాంగ పరిరక్షణ దీక్షకు తరలివెళ్లిన బిజెపి నేతలు

నమస్తే శేరిలింగంపల్లి: అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన, హై కోర్టు ఆదేశాలను పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షకు బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు,‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలో మొదటి రోజునే భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ముగ్గురు బిజెపి శాసనసభ్యులను మాత్రమే సస్పెండ్ చేయడం పట్ల హైకోర్టును ఆశ్రయించామని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం లెక్కచేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, స్పీకర్ వ్యవహరించిన తీరు దుర్మార్గమైన చర్య అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ పాలన తీరుకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బిజెపి ఎమ్మెల్యే లను చూస్తే సీఎం‌ కేసీఆర్ కు చమటలు పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఎల్లేష్ , కసిరెడ్డి సింధు రెడ్డి నాగులు గౌడ్, కసిరెడ్డి రఘునాథ రెడ్డి, శ్రీధర్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీశైలం, వినోద్ యాదవ్, రమేష్, హనుమంతు నాయక్, గణేష్, శ్రీనివాస్ యాదవ్, పద్మ, శిరీష, వరలక్ష్మి, ఇందిరా, సరోజ రెడ్డి, శ్రీను, నరసింహా, మదనాచారి, నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, అన్ని డివిజన్ల నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

రాజ్యాంగ పరిరక్షణ దీక్షకు బయల్దేరుతున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here