కాకతీయహిల్స్ లో బడాబాబుల పేకాట..?- పోలీసుల దాడిలో రూ. 90 లక్షల‌ నగదు స్వాధీనం

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లో పేకాట ఆడుతున్న స్థావరంపై డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో ఎస్ ఓ టీ పోలీసులు చేసిన దాడుల్లో అధికార‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, బడాబాబులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు‌. ఈ దాడిలో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయనను వదిలేసిన పోలీసులు మిగతా ఎనిమిది మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ కాకతీయ హిల్స్ రోడ్ నంబర్ 6, జీనియస్ విపంచి అపార్ట్ మెంట్ లో శ్రీనివాస్ అనే‌ వ్యక్తికి సంబంధించిన ఫ్లాట్ లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. ఈ దాడిలో శ్రీనివాస్, గోవర్ధన్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీకాంత్,‌ సౌజన్య, వసంత, వందన ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 90లక్షల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టయిన వారంతా మాదాపూర్, మెడ్చల్, బోయిన్ పల్లి తదితర ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా గుర్తించినట్లు సీఐ చెప్పారు. ఇదిలా ఉంటే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఇతర రాజకీయ‌ నాయకులు, డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తులున్నప్పటికి వారిని తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

పేకాట‌ దాడిలో పోలీసులు‌ స్వాధీనం చేసుకున్న నగదు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here