అస్సాం సీఎం అనుచిత వాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ – చందానగర్ లో హిమంత బిస్వా శర్మ దిష్టిబొమ్మ దగ్ధం

నమస్తే శేరిలింగంపల్లి: రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు జెరిపాటి జైపాల్ మండిపడ్డారు. అస్సాం ముఖ్యమంత్రి వాఖ్యలను నిరసిస్తూ జైపాల్ ఆధ్వర్యంలో చందానగర్ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జెరిపాటి జైపాల్ మాట్లాడుతూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

చందానగర్ గాంధీ విగ్రహం వద్ద అస్సాం సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

నీచంగా వ్యక్తిగత దూషణలు చేస్తూ దేశ సంస్కృతిని కించపరుస్తూ దేశం కోసం బలిదానం చేసిన కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం బిజెపి నేతలు దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. బ్రిటీష్ పాలకుల మనస్తత్వం కలిగిన బీజేపీ నేతలు నిజమైన దేశభక్తి కలిగిన రాహుల్ గాంధీని కించపర్చడం బాధాకరమన్నారు. అనంతరం చందానగర్ పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు రఘునందన్ రెడ్డి, ఇలాయస్ షరీఫ్, సురేష్ నాయక్, మారేళ్ల శ్రీనివాస్, జావీద్ హుస్సేన్, పోచయ్య, కాట నర్సింహ గౌడ్, రాజేందర్, జహంగీర్, ఆయాజ్ ఖాన్, హాబీబ్ జానీ, అజీముద్దీన్, హరికిషన్, నల్లగండ్ల రమేష్, అల్లుద్దీన్ పటేల్, ఖాజా పాషా, యువజన కాంగ్రెస్ నాయకులు సౌందర్య రాజన్, శ్రీహరి గౌడ, రాజేష్ గౌడ, వల్లెపు రాజు ఖాజా, ముక్రం, చోటు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here