మియాపూర్ తెరాస కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా అవ‌కాశం క‌ల్పించండి

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి తెరాస సీనియర్ నేత మరపు గంగాధరరావు బ‌యోడేటా అంద‌జేత

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రానున్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికల్లో మియాపూర్ డివిజన్ తెరాస పార్టీ తరఫున కార్పొరేటర్ గా బరిలో నిలిచేందుకు అవకాశం కలిగించాలని కోరుతూ మియాపూర్ డివిజన్ తెరాస సీనియర్ నేత మరపు గంగాధరరావు శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసి తన బయోడేటా అందజేశారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి బ‌యోడేటా అంద‌జేస్తున్న మరపు గంగాధరరావు

మియపూర్ డివిజన్ లో స్థానికంగా నివాసముంటున్న తాను 2009వ సంవత్సరంలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్న ఉద్యమ స్పూర్తితో ఆకర్షితుడనై తెరాస పార్టీలో చేరాన‌ని తెలిపారు. పార్టీలో చేరినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ తెరాస పార్టీ పటిష్టత కోసం పాటుపడుతున్నానని అన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం డివిజన్ అధ్యక్షుడిగా ఏ ఎన్నికలు వచ్చినా తెరాస కార్పొరేటర్ బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసినట్లు గంగాధరరావు గుర్తు చేశారు.

కరోనా టైంలో కూడా ప్రజలకు ఎంతో సేవచేశానని, తాను దాదాపుగా 25 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, స్వచ్చంద సేవకార్యక్రమాలు కూడా చేశానని, వాటికి గుర్తింపుగా డాక్టరేట్ పొందానని, కావున తెరాస పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తూ ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటూ తన సేవలందించాలని ఆశిస్తున్నానని, ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మియాపూర్ డివిజన్ తరపున తనకు అవకాశం కల్పిస్తే పార్టీ పటిష్టత కోసం ప్రజలకు తన వంతు సేవలందిస్తానని గాంధీకి ఇచ్చిన వినతి పత్రంలో గంగాధర్ రావు కోరారు. ప్ర‌భుత్వ విప్‌ గాంధీని కలిసిన వారిలో మియాపూర్ డివిజన్ వార్డ్ మెంబర్ వరలక్ష్మి, రోజా, శైలేష్, బాబురావు తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here