వ్యక్తి అంత్యక్రియలకు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ఆల్విన్ కాలనీ(నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్యంతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలకు ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. డివిజన్ పరిధిలోని షంషీగూడ ప్రాంతానికి చెందిన ధనరాజ్ అనే వ్యక్తి అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్ వార్డు సభ్యులు కాశీనాథ్ యాదవ్ నాయకులు శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here