మాదాపూర్ డివిజ‌న్ బీజేపీ నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని బుధ‌వారం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో బీజేపీ మాదాపూర్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీజేపీ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా పి.కృష్ణ వినయ్ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కే వినోద్ కుమార్, పీ కృష్ణ చందు, ఉపాధ్యక్షులుగా వెంకటేష్ బాబు, నర్సింహ యాదవ్, బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడిగా ఆనంద్ కుమార్ నియమితులయ్యారు.

నూత‌నంగా ఎన్నికైన వారికి నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న గ‌జ్జ‌ల యోగానంద్

ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్, బీజేవైఎం శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ కుమ్మరి జితేందర్, డివిజన్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ గౌడ్, నాయకులు గంగాధర్, వెంకటేష్ యాదవ్, అరవింద్ సింగ్, మహేష్, సాయి తేజ, చంద్రమౌళి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here