ప‌ట్ట‌భ‌ద్రులు ఓట‌ర్లుగా నమోదు చేయించుకోవాలి: కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకోవాల‌ని కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బుధ‌వారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, సుభాష్ చంద్ర బోస్ నగర్, కృష్ణ కాలనీల‌లో ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ఓటు హ‌క్కు, ఎమ్మెల్సీ ఎన్నికల‌లో ఓటు వేసే విధానం త‌దిత‌ర అంశాలపై ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ఆయ‌న అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌ట్ట‌భ‌ద్రులు అంద‌రూ ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకుని రానున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట్లు వేయాల‌ని కోరారు.

ప‌ట్ట‌భ‌ద్రుల ఓటు హ‌క్కుపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యుడు ర‌హీం, ఆదిత్య నగర్ బస్తీ తెరాస అధ్యక్షుడు మహమ్మద్ ఖాసీం, సుభాష్ చంద్ర బోస్ నగర్ బస్తీ అధ్యక్షుడు ముక్తార్, కృష్ణా కాలనీ బస్తీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, నాయకులు భుజంగం, సత్యనారాయణ, రాములు యాదవ్, లియాకత్, బాబూమియా, రహమాన్, రామకృష్ణ, మాణిక్య‌ప్ప, మియాన్, మనోహర్, మునాఫ్ ఖాన్, జాఫ‌ర్, సాజిద్, నర్సింగరావు, రాజిరెడ్డి, ఖాజా, ప్రశాంత్, లోకేష్ రెడ్డి, విల్సన్, డేవిడ్, సతీష్, మూస, అర్షద్, ఇమ్రాన్, మజీద్, రాజేందర్, గోపి, రవి, అఖిల్, నవీన్, బాలి, మేహుల్ కుమార్, హరి, సూర్య ప్రకాష్, శ‌శిరేఖ, మొగులమ్మ, శ్రీజ రెడ్డి, రాణి, ఊర్మిళ‌, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

స‌మావేశంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై చ‌ర్చిస్తున్న కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here