గోపన్ పల్లి లో యూజీడీ పైపులైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి:గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లో‌ చేపట్టిన యూజీడీ పనులను గురువారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. గోపన్ పల్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోపన్ పల్లి లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు ఉండడంతో పాత డ్రైనేజీ పైప్ లైన్ పూరుకుపోవడంతో కొత్త పైప్ లైన్ పనులను వేయించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రకాష్ రంగస్వామి, కాలనీ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గోపన్ పల్లిలో యూజీడీ పైపులైన్ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here