రాజీవ్ గృహకల్పలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించిన రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో మొబైల్ వాక్సినేషన్ డ్రైవ్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. రాజీవ్ గృహకల్ప లో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ వాక్సిన్ ఉచితంగా అందిస్తున్నారని రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప వార్డ్ మెంబర్ శ్రీకళ, చంద్రకళ, శ్రీనివాస్, సబిన, కుమారి, మల్లికాంబ, బసవరాజ్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, మొబైల్ వాక్సిన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here