గడ్డపార సత్యనారాయణ మరణం సగర సమాజానికి తీరని లోటు: ఉప్పరి శేఖర్ సాగర్

గడ్డపార సత్యనారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: యాదాద్రి సగర ఉప్పర అన్నదాన సత్రం, సగర సంఘం గ్రేటర్ హైదరాబాద్ ల ప్రధాన కార్యదర్శి గడ్డపార సత్యనారాయణ హఠాన్మరణం సగర సమాజానికి తీరని లోటని రాష్ట్ర సగర సంగం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఓ ప్రకటనలో అన్నారు. గత ఇరవై రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడన్న విషయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గొప్ప వ్యక్తిత్వంతో సగర సమాజానికి సత్యనారాయణ చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు. సగరుల హక్కుల సాధనకోసం జరుగుతున్న పోరాటంతో పాటు సగరుల అభివృద్ధికి ఆయన అందించిన సహకారం ఎనలేనిదని కొనియాడారు. సత్యనారాయణ మృతికి రాష్ట్ర సగర సంఘం తరపున సంతాపం ప్రకటిస్తూ ఆయన కుటుంబానికి సగర సంఘం అండగా ఉంటుందని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here