నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రభుపాద లేఔట్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శనివారం ప్రభుపాద లేఔట్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తదితర సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యల తీవ్రతను వివరించారు. పాత పైపులైన్లను క్రమబద్ధీకరించి, వాటి స్థానంలో త్వరితగతిన, కొత్తగా పైపు లైన్లు ఏర్పాటు చేయించినట్లు చెప్పారు.






