నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీలోని వార్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సోమవారం పరిశీలించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకుని కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులు ఉన్నారు.