ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పంచమి కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సోమవారం పాదయాత్ర చేపట్టారు. స్థానికంగా ఆయన పర్యటించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాలనీలో డ్రైనేజీ సమస్య ఉందని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, మంజీరా నీటి సరఫరా సరిగ్గా లేదని కాలనీవాసులు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్కు వివరించారు. అలాగే కాలనీలోని ప్రధాన వీధిలో ఉన్న ట్రాన్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన వాటిని పరిష్కరిస్తానని కార్పొరేటర్ స్థానికులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, సీనియర్ నాయకులు సేవర్తి నర్సింహ చారి, ప్రదీప్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ పంచమి గణేష్, కాలనీ వాసులు సంగమేష్, అశోక్, రమేష్, నాని, లక్ష్మణ చారి, యాదగిరి, వాసు, సాయిలు, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.