హఫీజ్పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట డివిజన్ పరిధిలోని పట్టభద్రులందరూ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం డివిజన్ పరిధిలోని గంగారం, సుభాష్ నగర్, యూత్ కాలనీ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు. వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేలా చూడాలని పిలుపునిచ్చారు.