నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత సురభివాణిదేవిని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు గుడ్ల ధనలక్ష్మి ఇతర నాయకులతో మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం సురభివాణీదేవి నివాసంలో ఆమెను కలిసిన ధనలక్ష్మి పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు పర్వత తదితరులు పాల్గొన్నారు.






