నిరుపేద విద్యార్థి చ‌దువుకు ప‌సుమ‌ర్తి చారిట‌బుల్ ట్ర‌స్టు ఆర్థిక స‌హాయం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంఘం, పసుమర్తి మాధవరావు, దమయంతి చారిటబుల్ ట్రస్ట్ ల ఆధ్వ‌ర్యంలో శేరిలింగంపల్లికి చెందిన ఓ పేద విద్యార్థి చ‌దువుకై ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేశారు. మంగ‌ళ‌వారం ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కులు పసుమర్తి శ్రీనివాస్ గుప్త, వసుందర దంపతులు శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన‌ మణికంఠ స్కూల్ ఫీజు కోసం ప‌దివేల రూపాల‌య ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌నివాస్‌గుప్త మాట్లాడుతూ విద్య‌దానం అన్ని దానాల‌లోకెల్లా గొప్ప‌ద‌ని, పేద విద్యార్థుల‌కు విద్యాదానం చేస్తే వారి కుటుంబానికి దారి చూపిన వార‌మ‌వుతామ‌ని తెలిపారు. ఈ కార్యక్ర‌మంలో శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు మారం వెంకట్ గుప్త, వర్కింగ్ ప్రెసిడెంట్ నటరాజ్ గుప్త, కోశాధికారి సంపత్ గుప్త, కార్య‌ద‌ర్శి వనమా శ్రీనివాస్ గుప్త ఉపాధ్య‌క్షులు మ‌హేష్‌ గుప్త స‌భ్యులు వాస‌ముర‌ళి త‌దిత‌రులు పాల్గొన్నారు.

విద్యార్థికి ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేస్తున్న ట్ర‌స్టు స‌భ్యులు, ఆర్య‌వైశ్య సంఘం ప్ర‌తినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here