
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను చందా నగర్ లోని ట్రస్ట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అథితులుగా ఇన్సైనిస్ స్కూల్ ప్రిన్సిపాల్ దివ్యలత బిమనోహర్, ప్రముఖ గైనకాలజిస్ట్ అరుణ చెన్నరెడ్డి, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, క్రీడాకారిణి సవిత లతో హాజరైన ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి కేకు కట్ చేసి ఈ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో ట్రస్టు సభ్యులు నూనె సురేందర్, జయ కుమార్, నాగేశప్ప, సత్తిబాబు, అర్జున్, భవాని చౌదరి, సరళ రాణి, వరలక్ష్మి, మాధవి, ప్రభావతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.





