హఫీజ్పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసు విభాగానికి చెందిన 29 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ బాబు, ఏపీఎంవో రమేష్ నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.






