గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి ఎన్జీవోఎస్ కాలనీలో శుక్రవారం భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. టోర్నమెంట్లో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులను ఆయన అభినందించారు. అనంతరం క్రీడాకారులకు చెందిన జెర్సీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగేష్ యాదవ్, మాజీ వార్డు మెంబర్లు మల్లేష్ యాదవ్, నర్సింగ్ రావు, బలరాం, మాట్ల తిరుపతి, మహేందర్, భిక్షపతి, శ్యామ్ రావు, గిరి, ప్రసాద్, కిషన్, గుండప్ప, కిషోర్ యాదవ్, పాపాలాల్ పాల్గొన్నారు.







