మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా యాంఫీ థియేటర్ లో నిర్వహించిన వేణు నాదామృతం సంగీత కార్యక్రమం సందర్శకులను అలరించింది. 30 మంది కళాకారులు ఈ సందర్భంగా పలు కీర్తనలను వాయించారు. రవి కుమార్, రేవంశ్ కుమార్, కీర్తి, పుష్ప, డాక్టర్ ప్రభాత్, చైతన్య, విశాల్, శ్రీధర ఆచార్య, డాక్టర్ శ్రీకాంత్ లు పాల్గొన్నారు.
