గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి లక్ష్మీ అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలను నిర్వహించారు. ఈ సందర్బంగా జాగర్లమూడి జనార్దన రావు సౌజన్యంతో పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉమా చంద్రశేఖర్, శివరామకృష్ణ, ఆదిలక్ష్మీ, భారతి పాల్గొన్నారు.






